ఎప్పుడూ వివాదాస్పద ప్రసంగాలు చేసే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. అది ఓ బహిరంగసభది. సభనుద్దేశించి మాట్లాడుతూ మధ్యలో ఆయన ఏడుస్తున్నట్టు ఆ వీడియో ఉంది. ఇటీవల మధ్యప్రదేశ్ ఖర్గోన్, ఢిల్లీలోని జహంగీర్ పురిలో చెలరేగిన అల్లర్ల గురించి ప్రస్తావిస్తూ మధ్యలో ఏడవడం కనిపించింది. హైదరాబాద్ మక్కా మసీదులో అల్విదా నమాజ్ అనంతరం ముస్లింలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖర్గోన్, జహంగీర్పురిలో ముస్లింలకు అన్యాయం జరిగిందని, వారి ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారని వాపోతూ ఎవరూ ఆశ, ధైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. తమపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాల గురించి…ఇళ్లు, దుకాణాలు కూల్చివేస్తున్నారంటూ ఫోన్లు చేసి చెబుతున్నారని… అయితే ఎవరూ బాధపడవద్దని…సహనంతో ఎదుర్కొందామని చెప్పారు. ముస్లింలు తమ ప్రాంతాలను వదిలిపెట్టరనని…ఎందుకంటే వారు మృత్యువుకు భయపడరనీ అన్నారు. తన కమ్యూనిటీ ఉనికినే చెరిపేసే కుట్ర జరుగుతోందని…అయితే ముస్లింలు వేచి ఉంటారని…తిరిగి పోరాడుతారు తప్ప యుద్ధభూమిని విడిచిపెట్టరని అసద్ అన్నారు.
ఇక మోదీ, షాకూ గట్టి హెచ్చరికే చేశారు అసదుద్దీన్… మోదీ, అమిత్ షా…వినండీ. మేం మీముందు తలవంచం, అల్లాముందు మాత్రమే వంచుతాం, మాకు అల్లా చాలు అని విరుచుకుపడ్డారు ఎంఐఎం చీఫ్.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)