
PM addressing the inaugural session of Semi-con India Conference in Bengaluru, through video conferencing, in New Delhi on April 29, 2022.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఏప్రిల్ 29) బెంగళూరులో భారతదేశపు మొదటి సెమికాన్ కాన్ఫరెన్స్ను వర్చ్యువల్ గా ప్రారంభించారు. వ్యాపారానికి నిజమైన అర్థాన్ని దేశం చూపించిందని, ఇప్పుడు భారతదేశాన్ని “వైబ్రెంట్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్”గా మార్చడం పారిశ్రామికవేత్తలపై ఆధారపడి ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, సెమీకండక్టర్ పరిశ్రమల వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సహ పలువురు దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
ప్రపంచం నూతన పోకడలతో వినూత్నంగా ఏర్పడుతోంది, మనం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని . ఈ దేశ ప్రజలు అంటే వ్యాపారం అని భారతదేశం చూపించింది. ఇప్పుడు భారతదేశాన్ని ఒక శక్తివంతమైన సెమీకండక్టర్ ఎకోసిస్టమ్గా మార్చే పని మనపై ఉందని మోదీ అన్నారు.
Addressing the inaugural session of Semi-con India Conference being held in Bengaluru. https://t.co/D0mtwSQKmo
— Narendra Modi (@narendramodi) April 29, 2022
ప్రస్తుత పరిస్థితుల్లో మనం 21వ శతాబ్దపు అవసరాల కోసం భారతీయ యువకుల నైపుణ్యాలను పెంచుతున్నాం. దేశం అసాధారణమైన సెమీకండక్టర్ డిజైన్ ప్రతిభను కలిగి ఉందని, ప్రపంచంలోని ఇంజనీర్లలో 20 శాతం మందిని భారత్ తయారు చేస్తుందని ప్రధాని చెప్పారు.
నేటి ప్రపంచంలో సెమీకండక్టర్ల కీలక పాత్రను వివరిస్తూ, “ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా గొలుసులలో భారతదేశాన్ని కీలక భాగస్వాములలో ఒకటిగా స్థాపించడం మా సమిష్టి లక్ష్యమని, మేము హైటెక్, అధిక నాణ్యత, అధిక విశ్వసనీయత సూత్రాల ఆధారంగా ఈ దిశలో పని చేయాలనుకుంటున్నాం” అని అన్నారు.
సెమీకండక్టర్ టెక్నాలజీకి భారతదేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడానికి ఆరు కారణాలు ఉన్నాయని… “సెమీకండక్టర్ టెక్నాలజీకి భారతదేశం ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉండటానికి నేను ఆరు కారణాలను చూస్తున్నాను.. అత్యున్నత సాంకేతికత, అధిక నాణ్యత, అధిక విశ్వసనీయత అనే సూత్రాల ఆధారంగా మేం ఈ దిశలో పని చేయాలనుకుంటున్నాం” అని వివరించారు.