ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ప్రతిపక్షాలు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శిస్తూ ఉంటారు. దేశాన్ని మోదీ దివాలా తీయిస్తున్నారని తోచినట్లు మాట్లాడేస్తూ ఉంటారు. ఇటువంటి కుళ్ళంమోతు వ్యక్తులకు గుండె పగిలే వార్త బయటపడింది. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్థికంగా గా మరింత పటిష్టం అవుతోందని మరోసారి రుజువైంది.
ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు సాధారణంగా అప్పులు దొరకవు. అటువంటప్పుడు బంగారం తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకోవాలి. ఆ తర్వాత డబ్బులు సంపాదించుకున్నాక బంగారాన్ని విడిపించుకోవడం రివాజు. దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. గత ప్రభుత్వాలు డబ్బులు దొరక్క .. అప్పుల కోసం ఇతర దేశాల దగ్గర ఆర్థిక సంస్థల దగ్గర, బంగారాన్ని తాకట్టు పెట్టేవారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశాన్ని ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తోంది. అందుచేత గత ప్రభుత్వాలు తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా విడిపించి తీసుకుని వస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) యునైటెడ్ కింగ్డమ్(UK) నుండి సుమారు 100 టన్నులు లేదా లక్ష కిలోల బంగారాన్ని వెనక్కి తీసుకువచ్చి తన నిల్వలకు బదిలీ చేసింది. రాబోయే నెలల్లో మరింత బంగారాన్ని భారత్కు తిరిగి తీసుకువచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తుంది. 1991లో తాకట్టు పెట్టిన ఈ బంగారాన్ని తొలిసారిగా ఆర్బీఐ స్టాక్లో చేర్చారు. 1991 తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఆర్బీఐ తిరిగి తీసుకువచ్చింది. దేశంలో విదేశీ మారకద్రవ్య సంక్షోభం కారణంగా 1991లో ఆర్బీఐ తన బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో దేశం తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆర్బిఐకి చెందిన సగానికి పైగా బంగారం నిల్వలు విదేశాలలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ల వద్ద సురక్షితంగా ఉన్నాయి.
ఆర్బిఐ విడుదల చేసిన వార్షిక గణాంకాల ప్రకారం.. మార్చి 31, 2024 నాటికి విదేశీ మారక నిల్వల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వద్ద 822.10 టన్నుల బంగారం ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 794.63 టన్నులు ఉంది. 1991లో చంద్రశేఖర్ ప్రభుత్వం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్ని తనఖా పెట్టింది. జూలై 4 – 18, 1991 మధ్య, ఆర్బీఐ 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్తో 400 మిలియన్ డాలర్లను సమీకరించడానికి తాకట్టు పెట్టింది.
సెంట్రల్ బ్యాంక్ 15 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, భారతదేశం తన ఆస్తులను విస్తరించడానికి 6.7 బిలియన్ డాలర్ల విలువైన 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా రిజర్వ్ బ్యాంక్ కొనుగోలు చేసిన బంగారం స్టాక్లో నిరంతర పెరుగుదల ఉంటూనే ఉంది.
సెంట్రల్ బ్యాంక్ ద్వారా బంగారాన్ని స్టాక్లలో ఉంచడం ఉద్దేశ్యం ప్రధానంగా ద్రవ్యోల్బణం, విదేశీ మారకపు నష్టాలకు వ్యతిరేకంగా దాని విదేశీ కరెన్సీ ఆస్తులను పెంచడం. ఆ కారణంగా ఆర్బీఐ డిసెంబర్ 2017 నుంచి క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి బంగారాన్ని సేకరిస్తుంది. డిసెంబర్ 2023 చివరి నాటికి దేశంలోని మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో బంగారం వాటాను 7.75 శాతం నుంచి 2024 ఏప్రిల్ చివరి నాటికి 8.7 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దేశంలో ముంబై, నాగ్పూర్లోని మింట్ రోడ్లోని ఆర్బిఐ బిల్డింగ్లో ఉన్న సేఫ్లలో బంగారాన్ని ఉంచుతారు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు ఇప్పటివరకు తవ్విన మొత్తం బంగారంలో 17 శాతం కలిగి ఉన్నాయి. 2023 చివరి నాటికి నిల్వలు 36,699 మెట్రిక్ టన్నుల (MT) కంటే ఎక్కువగా ఉంటాయి.
1991 సంవత్సరంలో దేశంలో దిగుమతి చేసుకోవడానికి విదేశీ కరెన్సీ లేదు. అప్పుడు భారతదేశం తన 67 టన్నుల బంగారాన్ని తనఖా పెట్టి 2.2 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. బంగారాన్ని తనఖా పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముంబై విమానాశ్రయంలో చార్టర్ విమానం బంగారంతో ఇంగ్లండ్కు వెళ్లింది. అప్పుడు భారతదేశం ఇంగ్లండ్ నుంచి రుణం పొందింది. ఆ తర్వాత భారతదేశం తనఖా పెట్టిన బంగారాన్ని రీడీమ్ చేసింది. ఆ తర్వాత క్రమంగా దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా పెరిగాయి.
స్వాతంత్ర్యానికి ముందు నుండి మన దేశానికి చెందిన కొంత బంగారాన్ని లండన్లో నిల్వ చేశారు. మార్చి చివరి నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారాన్ని నిల్వ ఉంచగా, అందులో 413.8 టన్నులు విదేశాల్లో నిల్వ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 27.5 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. ఇటీవలి సంవత్సరాలలో బంగారం కొనుగోలు చేసిన సెంట్రల్ బ్యాంకులలో రిజర్వ్ బ్యాంక్ ఒకటి.
మొత్తం మీద భారత్ ను అభివృద్ధి పథంలో పరుగులు పెంచిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో రికార్డుని నమోదు చేసుకుంది.