మోడీ సర్కార్ మరో విప్లవాత్మక విజయం
జమ్ము కశ్మీర్ లో ఒక భాగంగా ఉన్నంత కాలం లడఖ్ ను పట్టించుకున్న వారు. అరుదైన భౌగోళిక స్థితిగతులు ఉన్న ప్రాంతమిది. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ నుంచి లడఖ్ ను విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు తర్వాత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం లఖ్ లో సొంత మెటిరియలాజికల్ సెంటర్ ను మంజూరు చేసింది. ఇది దేశంలోనే ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు కావడం విశేషం. అలాగే లడఖ్ లో మొదటి సెంట్రల్ యూనివర్సిటీ, వైద్య కళాశాల కూడా మంజూరయ్యాయి.
మరో విప్లవాత్మకమైన చర్య ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో రైల్వే ట్రాక్ నిర్మాణం. లడఖ్ నుంచి న్యూఢిల్లీకి రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తున్నది. దీని వల్ల లడఖ్ నుంచి కొత్త ఢిల్లీకి కేవలం 20 గంటల్లో చేరుకోవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని మోడీ సర్కార్ ఏర్పాటు చేయబోతోంది. సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రపంచంలో అత్యంత అనువైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా లడఖ్ అభివృద్ధి గురించి ఆలోచించ లేదు. మోడీ సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులతో లడఖ్ రూపురేఖలు మారబోతున్నాయి. అందుకే అక్కడి ప్రజలు నమో కేంద్ర ప్రభుత్వం అనే విధంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు.