
PM at the celebration of 125th Birth Anniversary of freedom fighter, Shri Alluri Sitarama Raju, in Bhimavaram, Andhra Pradesh on July 04, 2022.
125వ జయంతి సందర్భంగా ఏపీలో అల్లూరి విగ్రహాన్నిఆవిష్కరించిన అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు ప్రధాని మోదీ.కృష్ణమూర్తి కుమార్తె 90ఏళ్ల పసల భారతి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ఆంధ్రరాష్ట్రం పుణ్యభూమి… వీర భూమి. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.