టర్కీలో భూపంక సహాయక చర్యల్లో పాల్గొన్న భారత బృందాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
కొన్నేళ్లుగా స్వయంసమృద్ధి సాధిస్తున్న భారతదేశం నిస్వార్థంగా ఇతరులకూ సేవలందిస్తుందనే పేరునూ సొంతం చేసుకుంటోందనీ అన్నారు. భూకంపం తాకిడికి టర్కీ అల్లకల్లోలం కాగా..ముందుగా స్పందించింది భారతే. ఆ రోజే పెద్దెత్తున ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, తక్షణ అవసరాలతో ప్రత్యేక విమానాల్లో టర్కీ వెళ్లాయి. ఈనెల 7న అక్కడికి వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొన్న 3 బృందాలు తిరిగి భారత్ వచ్చాయి. అక్కడ ఎంతోమందికి ప్రాణదానం చేశాయి మన బలగాలు. ఈ సందర్భంగా ఆ బృందాలతో మోదీ మాట్లాడారు. తక్షణసాయంలో పాల్గొని భారతీయులు గర్వపడేలా చేశారని ప్రశంసించారు.
https://twitter.com/narendramodi/status/1627661506941968384?s=20