ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైద్పూర్ లోని కైలాష్ నగర్ టీకా సెంటర్ ని బీజేపీ నాయకులు సందర్శించారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన అందరికీ ఉచిత టీకా, 5 కేజీ ల బియ్యాన్ని మోదీసర్కారు ఇస్తుందని సుహాసినీరెడ్డి అన్నారు. ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఉచితంగా టీకా ఇస్తున్న ప్రధాని ఫోటో పెట్టకుండా రాష్ట్రముఖ్యమంత్రి తనఫొటో పెట్టుకోవడం దారుణమన్నారు.సొమ్మొకరిది సోకు ఒకరిది అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారన్నారు.ప్రతి సెంటర్ లో మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆమెతో పాటు జిల్లా సెక్రటరీ రాకేష్,సీనియర్ నాయకులు ప్రవీణ్,చిప్ప గంగన్న,కంఠం వేణుగోపాల్, లంకా శ్రీను, శోబా చిట్టేపు కార్యక్రమంలో పాల్గొన్నారు.