మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ పూర్తిగా పనిలో మునిగిపోయారు. కొంతకాలం క్రితం మొదలుపెట్టిన సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఏ దేశానికైనా సరిహద్దులు చాలా ముఖ్యం. అక్కడ పటిష్టమైన కాపలా ఉంటే విదేశీ శక్తులు చొరబడకుండా ఉంటాయి.
ఒకప్పుడు సరిహద్దు ప్రాంతాల్ని మన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకునేవి కాదు. అందుచేత ఉగ్రవాదులు తేలికగా దేశంలోకి చొరబడి .. మంటలు రాజేస్తూ ఉండేవారు. అందుకే దేశంలో ఎక్కడా చోట ఉగ్రవాదుల దాడులు జరుగుతూ ఉండేది.
కానీ నరేంద్ర మోడీ పాలనలో సరిహద్దు మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వాస్తవానికి సరిహద్దుల్లో శత్రువుల చొరబట్లను సరిహద్దు గ్రామాల ప్రజలే తేలికగా గుర్తించగలుగుతారు. గతంలో ఈ గ్రామాలను పెద్దగా పట్టించుకునే వారు కాదు ఈ ఊళ్లను దేశానికి చిట్టచివరి పల్లెలుగా భావించేవారు అక్కడ పెద్దగా మౌలిక సదుపాయాలు కూడా ఉండేవి కావు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పరిస్థితులు మార్చేసింది ఇకపై వాటిని దేశానికి మొట్టమొదటి గ్రామాలుగా గుర్తిస్తామని మోడీ స్వయంగా ప్రకటించారు అంతేకాకుండా అక్కడి గ్రామాల అభివృద్ధి కోసం వైబ్రేంట్ విలేజ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు దీని కింద హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ , జమ్మూ కాశ్మీర్, లద్ధాక్ లలో సరిహద్దు గ్రామాలను చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ విరివిగా రోడ్లను నిర్మించి వంతెనలు వేస్తూ వచ్చారు.
ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో చొరపాటు దారులను గమనించినట్లయితే అక్కడికి వెళ్లేందుకు సైన్యం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. బరువైన సామగ్రిని నెత్తిన పెట్టుకొని కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. ఆ పాటికి ఉగ్రవాదులు దేశంలో మరో చోటకి తరలిపోయేవారు. కానీ మోడీ సర్కార్ హయాంలో విరివిగా రోడ్ల నిర్మించడంతో సైనిక సోదరులు చకచకా సరిహద్దుల్లోకి దూసుకొని వెళ్లగలుగుతున్నారు.
ఇటు దేశంలోని తూర్పు భాగం కూడా చాలా ముఖ్యం ఈశాన్య రాష్ట్రాలు ప్రధానంగా బంగ్లాదేశ్ మయన్మార్ వంటి దేశాలతో సరిహద్దును కలిగి ఉంటాయి ఇక్కడ చొరబాటు దారులు అక్రమంగా వచ్చేసి దేశంలో తిష్ట వేసుకుని ఉంటున్నారు. ఈ చొరబట్లను అడ్డుకునేందుకుగాను రక్షణ బలగాలు గట్టిగా కష్టపడుతున్నారు. ఈ ప్రాంతం ఎక్కువగా కొండలతో అడవులతో నిండి ఉంటుంది ఇక్కడ గస్తీ కాసేందుకు సైనిక సోదరులకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎక్కడికి అక్కడ టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు ఫలితంగా కమ్యూనికేషన్ అనేది తేలిక అవుతుంది. సరిహద్దుల్లో బలగాలను ఒక చోట నుంచి ఒక చోటకి తరలించేందుకు వీలు కలుగుతోంది.
మొత్తం మీద సరిహద్దులు భద్రంగా ఉంటేనే దేశం పురోగమిస్తుంది ముఖ్యంగా పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ల నుంచి సమస్య పొంచి ఉంది కాబట్టి భారతదేశ కూడా సరిహద్దుల పట్ల పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రిగా మూడోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ.. సరిహద్దు భద్రతలను పటిష్టం చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల్లోనూ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు చోటుచేసుకున్నాయి దీనిని మోడీ సీరియస్ గా తీసుకున్నారు అందుచేత సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు.