కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ర్యాలీలో మోదీ-యోగీ అంటూ అమ్మాయిలు నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. డిసెంబర్ 26న ఝాన్సీలో కాంగ్రెస్ ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతుండగా పెద్దసంఖ్యలో యువత మోదీ మోదీ, యోగీ యోగీ అంటూ గట్టిగా నినదించడం కనిపించింది.
అయితే నినాదాలు చేసిన అమ్మాయిలపట్ల కాంగ్రెస్ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారంటూ టైమ్స్ నౌ జర్నలిస్ట్ శ్వేతా భట్టాచార్య ట్వీట్ చేశారు. ‘ఈవీడియో ప్రియాంక పాల్గొన్న ర్యాలీవి. వాళ్ల పట్ల కాంగ్రెస్ వాళ్లు అనుచితంగా ప్రవర్తించారు. లడకీ హై లడ్ సక్తీ హై… అంటూ వాళ్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మోదీ- మోదీ, యోగీ-యోగీ అంటూ నినాదాలు చేశారు’ అని శ్వేతా ట్వీట్ చేశారు.
‘లడ్కీ హుం..లడ్ సక్తీ హూం’ అనే నినాదంతో ప్రియాంక యూపీ ఎన్నికలప్రచారంలో వెళ్తున్న విషయం తెలిసిందే. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అమ్మాయిలతో దురుసుగా ప్రవర్తిస్తారంటూ వికాశ్ మహేశ్వరి మరో వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. బీజేపీ నాయకురాలు ప్రీతిగాంధీ సైతం కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనను తప్పుబట్టారు. ప్రియాంకా మీరేమో మహిళాసాధికారత నినాదాలిస్తారు. మరోవైపు మీ వాళ్లేమో అమ్మాయిలపై చేయిచేసుకున్నారు. సిగ్గు సిగ్గు అని ఆమె ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి అమ్మాయిల బ్యాండ్లను లాక్కున్న దృశ్యాలున్నాయి.