ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు హాజరవుతున్నారు. ఈ మేరకు భారత్ చేరుకున్న అబ్దెలా ఫతా ఎల్ సిసికి ఘన స్వాగతం పలికింది.ప్రధాని న రేంద్రమోదీ ఆయనతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక మెరుగుపరుచుకునేలా వ్యవసాయం, వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించారు. మూడు రోజుల పాటు అబ్దెల్లా భారత్ లో ఉంటారు. ఆసియా, ఆఫ్రికాలమధ్య వారధిలా ఉండే ఈజిప్టుతో భారత్ బంధం రోజురోజుకూ పెరుగుతోందని..ప్రాచీన, సాంస్కృతిక, ఆర్థికపరమైన బంధాలను మరింత బలోపేతం చేసేలా ఇద్దరు నాయకుల చర్చలు దోహదం చేస్తాయని విదేశాంగ ప్రతినిధి అరవింద్ బాగ్చిఅన్నారు. ఈసారి గణతంత్ర వేడుకల పరేడ్లో ఈజిప్టుకు చెందిన 120 మందితో కూడిన ఆదేశ సైనిక బృందం పాల్గొననుంది.