అమెరికా పర్యటనలో ఉన్న మోదీ… వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ తో భేటీ అయ్యారు. ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్ర పై ఇరువురునేతలు కీలకంగా చర్చించారు. వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఇండో-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలనీ చర్చించుకున్నారు.
పాకిస్థాన్లో పలు ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని… పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రభావం అమెరికా, భారతదేశాలపై పడకుండా చర్యలు తీసుకోవాలని కమలాహారిస్ మోదీని కోరినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి తెలిపారు. అమెరికా, భారతదేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం రెండు దేశాల బాధ్యత అని కమలాహారిస్ అన్నారు. కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో భారతదేశానికి మద్ధతు అందించిన కమలాహారిస్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అటు భారత్ ను సందర్శించాల్సిందిగా కమలాను ఆహ్వానించారు మోదీ.