కాశీవిశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన భారత ప్రధాని మోదీకి వారణాశిలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి పట్టణానికి చేరుకునే దారిపొడవునా ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. మోదీ వాహనంపై పూలవర్షం కురిపించారు. ఆలయ సమీపంలో కూడా కిక్కిరిసిన జనం ఆయనకు ఘన స్వాగతం పలికారు. మోదీ అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్తున్నారు. కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కాశీ వీధులు కాషాయజెండాలతో నిండిపోయాయి.