దేశవ్యాప్తంగా అంతకంతకూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న భారత ప్రధాని మోదీ చరిష్మా అంతర్జాతీయంగానూ పెరుగుతోంది. ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతల్లో మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు మోదీ. తాజాగా అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ “మార్నింగ్ కన్సల్ట్(Morning Consult)”ప్రపంచ అత్యుత్తమ నేతలపై సర్వేను నిర్వహించగా 75 శాతం ఓటింగ్తో ప్రధాని మోదీ టాప్ ప్లేస్ లో నిలిచారు.
అత్యంత ప్రజాదరణ కలిగిన 22 మంది అంతర్జాతీయ నేతలపై ఈ సర్వే నిర్వహించారు. అత్యధికంగా 75 శాతం రేటింగ్ మోదీకి వచ్చింది. 63 శాతంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం 41 శాతం అప్రూవల్ రేటింగ్తో 5వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో బైడెన్ తర్వాత స్థానంలో ఉన్నారు.
ఈ ఏడాది జనవరిలో విడుదలైన మరో సర్వేలో కూడా మోదీ మొదటి స్థానంలో నిలిచారు.
https://twitter.com/ani_digital/status/1563090297264881664?s=20&t=N096DlGyI0wiZJ3s7lLCUw