ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పెద్దన్నపాత్ర పోషిస్తున్నారు మోదీ. ఇరు దేశాల అధ్యక్షులతోనూ ఆయన ఫోన్లో మాట్లాడారు. పుతిన్ తో ఇప్పటికే రెండు సార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. జోక్యం చేసుకోవాల్సిందిగా ఉక్రెయిన్ కూడా భారత్ ను పలుమార్లు అభ్యర్థించింది. మరోసారి ఇవాళ పుతిన్ కు ఫోన్ చేసి దాదాపు 50 నిమిషాల పాటు మాట్లాడారు ప్రధాని. ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఉక్రెయిన్ ప్రెసిండెంట్ తో నేరుగా చర్చలు జరిపి సమస్య పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. సామాన్య ప్రజలు ఉండే చోట దాడులు చేయకపోవడంపై ఆయన్ని ప్రధాని అభినందించినట్టు తెలిసింది.
PM Modi spoke on the phone to Russian President Putin. The phone call lasted for about 50 min. They discussed the evolving situation in Ukraine. President Putin briefed PM Modi on the status of negotiations between the Ukrainian and Russian teams: GoI Sources
(File pics) pic.twitter.com/KCGv8Sz894
— ANI (@ANI) March 7, 2022
అంతకుముందు ఆయన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్క్రీతో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను అందించడంతో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడ చిక్కుకుపోయిన మిగతా భారతీయ పౌరులు, విద్యార్థులందరూ సురక్షితంగా స్వదేశం చేరేలా సహకరించాలని కోరారు.
అటు మోదీకి జెలెన్ స్క్రీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాసేనల్ని ఎదుర్కొంటున్న తీరుపై మోదీ అభినందించారని.. ఉక్రెయిన తరపున నిలిచినందుకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. మోదీ, జెలన్ స్కీలిద్దరూ అరగంటకు పైగా మాట్లాడుకున్నారు.
రష్యా దురాక్రమణ గురించి మోదీకి చెప్పానని… శాంతి నెలకొల్పే చర్చలపై ఉక్రెయిన్ ను ఆయన అభినందించారని..ట్వీట్ చేస్తూ stop russia అనే హ్యాష్ ట్యాగ్ చేర్చారు జెలన్ స్కీ.
Prime Minister Modi spoke on phone to President Volodymyr Zelensky of Ukraine.The phone call lasted for about 35 minutes. The two leaders discussed the evolving situation in Ukraine. PM appreciated the continuing direct dialogue between Russia & Ukraine: GoI Sources
(File pics) pic.twitter.com/oCej7bZZzB
— ANI (@ANI) March 7, 2022
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)