శివాజీ ఆశయాలను ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మొఘలులు సహా విదేశీ దండయాత్రికులు ధ్వంసం చేసిన ఆలయాలను శివాజీ పునరుద్ధరించారని ఇప్పుడు ప్రధాని సైతం అదేపనిచేస్తున్నారనీ అన్నారు. ఛత్రపతి శివాజీ జీవితంపై పుణెలో నిర్మిస్తున్న థీమ్ పార్క్ ” శివసృష్టి” తొలిదశను షా ప్రారంభించారు. 21 ఎకరాల్లో థీమ్ పార్క్ ను సిద్ధం చేస్తున్నారు.శివాజీ తరువాత బాజీరావ్ పీష్వా,మాధవరావు పీష్వా, రాణీ అహల్యాబాయి వంటి వాళ్లు పునరుద్ధరించారని..ఇప్పుడు దానికి కొనసాగింపుగా మోదీ కాశీ, అయోధ్య వంటి ఆలయాల పునరుద్ధరణ చేస్తున్నారని గుర్తు చేశారు.