కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్…మరికొన్ని నెలల్లో వచ్చే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలనుంచి పోటీ చేస్తామని ప్రకటించారు. రాజస్థాన్లో 200, మధ్యప్రదేశ్లోని మొత్తం 230 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించుతామని ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి కేజ్రీవాల్ భోపాల్లో పర్యటించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనపై మధ్యప్రదేశ్ ప్రజలు విసుగెత్తిపోయారని… కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని… ఇక తామే ప్రత్యామ్నాయమనీ అన్నారు.
ఆప్ ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారనీ కేజ్రీ వ్యాఖ్యానించారు.