దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చెదపురుగుల్లా ప్రజల ఆస్తులు దోచుకునే కాంట్రాక్టర్లు అనేకమంది ఉండేవారు, కానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఈ చెదపురుగుల భరతం పడుతున్నారు. దీంతో ఆయా వర్గాలకు మోడీ అంటే చాలా కడుపు మంటగా మారింది. అందుచేతనే మోడీ మరోసారి అధికారం లోకి రాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు.
ఉదాహరణకు రోడ్డు కాంట్రాక్టుల పేరుతో గతంలో జరిగిన దోపిడీ ఒకసారి చూద్దాం.
టోల్ గేట్ అనేది దేశ రవాణా రంగంలో ఒక అతి పెద్ద స్కాంగా ఉండేది. 100 కోట్ల రోడ్ కి గవర్నమెంట్ డబ్బు ఇవ్వలేక కాంట్రాక్టర్ నే వసూలు చేసుకొమ్మనేది..కాంట్రాక్టర్ 100 వాహనాలు నడిచే రోడ్ మీద 10 వాహనాలే వస్తాయని ఎస్టిమేట్ చేయించేవాడు. (ఎస్టిమేషన్ సమయం లోనే మొదలు)
దాంతో ఐదేళ్లలో తీసేయా ల్సిన టోల్ బూత్ 10-15 యేళ్లు ఉంటుంది.
తర్వాత కాలంలో రోడ్డుమీద టోల్గేట్ ఏర్పాటు చేస్తారు కానీ ఆ టోల్ గేట్ గుండా వెళ్తున్న వాహనాల నుంచి క్యాష్ రూపంలో డబ్బులు తీసుకుంటారు. వాహనాల సంఖ్యను బాగా తగ్గించి లెక్క చూపిస్తారు.
వచ్చిన వాహనాల లెక్క ఎస్టిమేట్ చేసిన సంఖ్య కన్నా తక్కువ చూపిస్తారు. దానితో కాంట్రాక్టర్ కు ఇంకా తన బాకీ వసూలు కాలేదు అని రికార్డ్ తయారవుతుంది.ఇది తీసుకెళ్లి టోల్ వసూలు పీరియడ్ ఇంకో 5 యేళ్లు పెంచుతారు. రికార్డ్ లో చూపించని కారణం గా వసూలు అయిన డబ్బంతా ట్యాక్స్ కట్టనవసరం లేకుండానే జమ అవుతుంది. (30-35% profit).
ఈ రికార్డ్ తరువాతి ప్రాజెక్ట్ లకు బేస్ లైన్ అవుతుంది. తద్వారా తరువాతి ప్రాజెక్ట్ ల దోపిడీకి అప్పుడే పునాదులు.
5 ఏళ్లలో తీసేయా ల్సిన టోల్ బూత్ అఫిషియల్ గానే 15-20 యేళ్లు ఉండేలా చేసేవారు. ఆపైన అన్ అఫిషియల్ గా ఇంకో 5 యేళ్లు కొనసాగేది. .వాహనాల రికార్డ్ అర కొర గా చూపించి భారీ మొత్తం..దాని మీద ట్యాక్స్ కట్టకుండా ఇంకో 30-35%.ఈ దోపిడీ కొనసాగేది.
దీనిని ఆపాలంటే..
టోల్ బూత్ లో కాంట్రాక్టర్ మనుషులు కూర్చున్నా కూడా, డబ్బులు వారి చేతికి వెళ్లకుండా డైరెక్ట్ గా ప్రభుత్వంకి వెళ్లాలి. అందుకోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాస్ట్టాక్ పద్ధతిని తీసుకువచ్చింది దీంతో వాహనదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. క్యూ లైన్ లలో ఉండాల్సిన అవసరం లేకుండా వాహనాలు నేరుగా వెళ్లిపోతున్నాయి, అలాగే వాహనదారుల నుంచి డిజిటల్ విధానంలో పేమెంట్ జరిగిపోతుంది. అంతిమంగా వాహనాలు సంఖ్య నికరంగా తెలుస్తోంది. పైగా దొంగతనాలు అరాచకాలు జరిగినప్పుడు ఆయా వాహనాలు ఏ టోల్ గేట్ ద్వారా ప్రయాణించే సులువుగా తెలుసుకోగలుగుతున్నారు. మరోవైపు చెదపురుగులాంటి కాంట్రాక్టర్లకు కళ్ళెం వేయగలిగారు.