
మన ఆర్మీ జవానులు వెంటపడి చితక్కొట్టి వారిని తరిమేసిన వీడియోలు సోషల్ మీడియాలో మనం చూశాం.
ఈ సంఘటన తరువాత చైనా అధికార ప్రతినిధి ఒక స్టేట్మెంట్ ఇస్తూ బోర్డర్ వద్ద ఘర్షణ జరిగింది, చైనా సైనికులను భారత సైనికులు గాయ పరచారు, బోర్డర్ వద్ద ఫ్రంట్ లైన్ లో వుండే తమ సైనికులను భారత్ ప్రభుత్వం సంయమనం పాటించమని చెప్పాలి అని చైనా కోరింది.
కథ ఇలా వుంటే, మొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ చైనా సైనికులు చేతిలో మన సైనికులు చితకొట్ట బడ్డారు..మోడీకి చీమ కుట్టి నట్లు లేదు అని సిగ్గులేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. మీడియా కూడా వాడిని ప్రశ్నించకుండా వాడికి వంత పాడుతూ ప్రజల్లో అనుమానాలు రేకిత్తిస్తోంది. రాహుల్ పార్టీ చైనా కమ్యునిస్టు పార్టీతో ఒప్పొందమ్ (MOU) ఒకటి కుదుర్చుకుంది. బహుశా ఆ ఒప్పొందం లో ఇది కూడా ఒక భాగమేమో?
గతంలో గల్వాన్ వద్ద ఘర్షణ జరిగి మన కల్నల్ సంతోష్ తో సహా 20 మంది మన సైనికులు చనిపోయినప్పుడు కూడా చైనా వారికి నష్టం జరగలేదు, మన వారే పోయారు అని ఇలాగే చైనా వారు చెప్పిన మాటలకే ఇక్కడ రాహుల్, మిగతా ప్రతిపక్షాలు, మీడియా కూడా ప్రచారం కల్పించాయి. కానీ చైనాలో గత రెండు సం.లలో ఈ తేదీ నాడు చనిపోయిన వారి సంస్మరణలు జరుగుతున్న ప్రకారం 40 మంది కంటే పైగా చైనా సైనికులు లేదా అధికారులు మరణించారు అని బయట పడింది.
అన్నిటి కంటే విచిత్రం ఏమిటంటే మోడీ ఫాసిస్టు ప్రభుత్వం నిజం చెప్పటం లేదు, అని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ యుపిఎ ప్రభుత్వం వున్నప్పుడు 2009లో చైనా బార్డర్ వద్ద జరిగిన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దు అని, ఈ విషయంలో తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేస్తున్న మీడియా వారిపై చర్యులు తీసుకుంటాం అని యుపిఎ ప్రభుత్వం హెచ్చరించడమే కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా కు చెందిన ఇద్దరు రిపోర్టర్స్ మీద FIR కూడా నమోదు చేశారు.
అందుకే మోడీది ఫాసిస్టు పాలన – కాంగ్రెస్ ది ప్రజాస్వామ్య పాలన.
…..చాడా శాస్త్రి….