నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ పరిశీలించారు. భవనంలోని రాజ్యసభ, లోక్ సభ చాంబర్లలో తిరిగారు. నిర్మాణ పనుల గురించి ఇంజినీరింగ్ నిపుణులను అడిగి తెలుసుకున్నారు. లోక్ సభ స్పీకర్ తో కలిసి గంటపాటు అక్కడే గడిపారు. కార్మికులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో కొత్త భవనంలోనే నిర్వహించే అవకాశాలున్నాయి.2020 డిసెంబర్ 10న కొత్త పార్లమెంట్ భవన సముదాయానికి మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
More Photos :