ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం అదే సెంట్రల్ విస్టా పనులు శరవేగంతో జరుగుతున్నాయి. వచ్చే సం.కి అంటే స్వాతంత్య్రం వచ్చి 75 సం.లు అయిన సందర్భంగా ఈ కొత్త పార్లమెంట్ భవనంలో నే కార్యకలాపాలు జరిగే విధంగా ప్రణాళికలు రచించి పనులు జరిపిస్తున్నారు.
అందుకే సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ వద్ద పనులు రాత్రి పగలు అనే తేడా లేకుండా చేస్తున్నారు.
అక్కడ నిన్న రాత్రి 8.45 అయింది.
ఆకస్మికంగా ఎటువంటి ముందస్తు సెక్యూరిటీ సమాచారం కూడా లేకుండా ప్రధాని మోడీ ఈ సెంట్రల్ విస్టా పనుల పురోగతి సమీక్షించడానికి వచ్చారు. అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు వర్కర్లు ఆశ్చర్యపోయారు.
ప్రధాని మోడీ అక్కడ ప్రాంగణం అంతా తిరిగి నిర్మాణాల పురోగతిని గూర్చి అక్కడ ఇంజనీర్లు కార్మికులతో చర్చించి తగు సూచనలు ఇస్తూ ఒక గంటకు పైగా తన సమయం అక్కడ వెచ్చించారు.

వయసు 71 సంవత్సరాలు.
దానికి ముందు గడిచిన 72 గంటల్లో మోడీ ….
20 గంటలు నాన్ స్టాప్ ప్రయాణం చేసి అమెరికా వెళ్ళారు.
అమెరికా లో బీడేన్, కమలా హారిస్ తో కాక చాలా మంది పెద్ద కంపెనీల సీఈఓ లతో సుమారు 20కి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు.
మళ్లీ 20 గంటలు జెట్ లో ప్రయాణం చేసి వచ్చిన వెంటనే తను అటెండ్ అవ్వవలసిన సమీక్షా సమావేశాలు హాజరు అయ్యారు
అంతే కాక ఒరిస్సా కు, ఆంధ్రాకు వస్తున్న గులాబ్ తుఫాన్ ముందస్తు చర్యలు గురించి ఆ ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో సమీక్షించారు.
నిన్న మన్ కి బాత్ 81వ ఎపిసోడ్ లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రాత్రి 8.45.కి ఇలా సెంట్రల్ విష్టా పనుల పురోగతి సమీక్షించడానికి వెళ్ళారు.
సాధారణంగా కాస్తా వయసులో వున్నవారే అమెరికా నుండి 20/24 గంటలు ప్రయాణం చేసి వస్తే జెట్ లాగ్ అని చెప్పి అలసట ఫీల్ అయి రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటారు.
అటువంటిది 71 సం.ల వయసులో కూడా ఇంత వత్తిడి తట్టుకుంటూ చలాకీగా వుండడం చాలా ఆశ్చర్యం.
….చాడా శాస్త్రి….
More Photos :



