ఢిల్లీలో భారత ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్రమోది ప్రారంభించారు. మొదటి టికెట్ ఆయనే కొనుగోలు చేసి మ్యూజియాన్ని చూశారు. ఈ మ్యూజియంలో గత ప్రధానమంత్రుల వివరాలతో పాటు…దేశాన్ని ఎలా నడిపించారు, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు, ఎలాంటి సంస్కరణలు తీసుకువచ్చారు వంటి వివరాలున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారతదేశపు సమగ్ర చరిత్ర సంగ్రహాలోకనాన్ని మ్యూజియంలో చూడవచ్చు. ఇప్పటివరకు పనిచేసిన 14 మంది మాజీ ప్రధానులకు ఈ మ్యూజియాన్ని అంకితం చేశారు మోదీ.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)