సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటనలో గాంధీనగర్-ముంబై మధ్య కొత్తగా ప్రారంభమైన సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ వందేభారత్ రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ. తరువాత కొంతదూరం రైల్లో ప్రయాణించారు. గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ కాల్పూర్ స్టేషన్ వరకు ప్రయాణించారు. రైల్వేసిబ్బంది కుటుంబసభ్యులు, మహిళా వ్యాపారవేత్తలు, యువతీయువకులతో కలిసి ముచ్చటిస్తూ ప్రయాణం సాగించారు మోదీ. ఆదివారం మినహా వారంలో ఆరురోజులు ఈ రైలు సర్వీసు నడుస్తుంది. అక్టోబర్ 1 నుంచి రైలు ప్రారంభం కానుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.