నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిననుంచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక తాజాగా ఈశాన్య భారతంలోనే అతిపెద్ద AIIMS ఆసుపత్రిని ప్రధాని మోదీ ప్రారంభించారు. అసోం రాజధాని గువాహటిలో 1120కోట్లతో దీన్ని నిర్మించారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి 2017 మేలో మోదీ శంఖుస్థాపన చేశారు. ఇక్కడ ఏడాదికి 100 ఎంబీబీస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. మొదటి బాచ్ 50 మందికి 2021లొనే తరగతులు తాత్కాలిక భవనాలలో ప్రారంభించారు. దీనికి 750 బెడ్స్ గల ఆసుపత్రిని అనుబంధంగా నిర్మించారు. దీనిలో 25 స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి..ఇవి కాకుండా ఆయుష్ విభాగానికి 30 బెడ్స్ కేటాయించారు.అంతే కాకుండా అస్సాం రాష్ట్రంలోనే నల్బరీ, నగావ్ మరియు కోక్రాఝర్ లో నిర్మించిన మరో మూడు మెడికల్ కాలేజీలను కూడా మోదీ జాతికి అంకితం చేశారు. ఈ ఎయిమ్స్ తోపాటు కొత్తగా నిర్మించిన మూడు మెడికల్ కాలేజీలు కమ్ ఆసుపత్రులు ఈశాన్య రాష్ట్రాల ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
https://twitter.com/narendramodi/status/1646795925267042307?s=20