ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సైనిక సోదరులకు అండగా నిలుస్తున్నారు. సరిహద్దుల్లో పనిచేసేందుకు వీలుగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మీ వెంటే మేమంతా అన్న భరోసాను కల్పిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఎముకలు కొరికే చలి వాతావరణంలో సైనికులతో కలిసి పండగలు జరుపుకున్నారు. సైన్యంతో మమేకం అయిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు.
దేశ సరిహద్దుల్లో సైనికులకు అండగా ఉండేందుకు ఒక భారీ టన్నెల్ ను సంకల్పించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కొండల మధ్య ఈ
షింకున్ లా టన్నెల్ రూపుదిద్దుకుంటోంది . భారత్ చైనా సరిహద్దులకు సమీపంలో దీనిని రూపకల్పన చేశారు.
లేహ్కు వెళ్లే రూట్లో ఈ టన్నెల్ను నిర్మిస్తున్నారు. ఈ టన్నెల్ సుమారు 4.1 కిలోమీర్ల పొడుగు ఉంటుంది. ట్విన్ ట్యూబ్ టన్నెల్ను సుమారు 15,800 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. వాస్తవానికి సరిహద్దు ప్రాంతాల్లో వాతావరణం లో ఎగుడు దిగుడులు బాగా ఎక్కువ. బాగా వేడి,, అత్యంత శీతలం కూడా చవిచూడాల్సి ఉంటుంది.
అయితే ఎటువంటి వాతావరణం ఉన్నా.. ఈ టన్నెల్ ద్వారా లేహ్కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.
ఒక రకంగా దీనిని ఇంజనీరింగ్ అద్భుతం అని పిలవవచ్చు.
ప్రపంచంలోనే ఈ టన్నెల్ అత్యంత ఎత్తులో ఉన్న టన్నెల్గా రికార్డు క్రియేట్ చేయనున్నది. దీని ద్వారా చాలా వేగంగా, సమర్థవంతంగా సైనిక దళాలు తమ ఆయుధాలను, సామాగ్రిని తరలించే అవకాశాలు ఉంటాయి. ఈ టన్నెల్ వల్ల లడాఖ్లో ఆర్థిక, సామాజిక ప్రగతి జరుగుతుందని ఆశిస్తున్నారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. అనంతరం సైనిక సోదరులకు అండగా నిలిచే ఈ టన్నెల్ పనులను వర్చువల్ ద్వారా ప్రారంభించారు.
ఈ టన్నెల్ ద్వారా లడాఖ్ వికాసానికి, బంగారు భవిష్యత్తుకు కొత్త మార్గాన్ని సూచిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కఠోరమైన వాతావరణం వల్ల .. లడాఖ్ ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారని, ఈ టన్నెల్ ద్వారా వాళ్లకు ఆ సమస్యలు తగ్గనున్నట్లు ఆయన చెప్పారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా స్థానిక ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
కార్గిల్లో విజయం సాధించి 25 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం నడుము కట్టింది. అందుకే దేశమంతా మోదీ కి జేజేలు పలుకుతున్నారు.