మూడురోజుల యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ జర్మనీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాస భారతీయుల నుంచి సాదరస్వాగతం లభించింది. బెర్లిన్-బ్రాండెన్బర్గ్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా హోటల్ అడ్లోన్ కెంపిన్స్కీ చేరుకున్నారు. అక్కడ భారతీయులతో ఉల్లాసంగా మాట్లాడారు. పెద్దవాళ్లతో వచ్చిన చిన్నారులను మోదీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి స్వయంగా వేసిన మోదీ చిత్రాన్ని ఆయనకు బహూకరించింది. మోదీ ఆ చిన్నారితో ఫొటో దిగారు. మరో బాలుడు దేశభక్తి గీతం పాడుతూ మోదీకి అభివాదం తెలిపారు. మోదీ ఎంతో ఆసక్తిగా పాటను వింటూ చిటికెలు వేశారు. పిల్లలంతా మోదీ పాదాలకు నమస్కరించిన ఆశీస్సులు తీసుకున్నారు.