వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 2 లక్షల యాభైవేల కోట్ల రూపాయాలు బకాయి పడ్డాయి ఆయా రాష్ట్రాల జెన్కో ,డిస్కం లకి. శనివారం ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రాలు తమ పవర్ జెనెరేషన్ కంపనీలు [gencos], పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపనీలకి బకాయిలు పడ్డ 2 లక్షల యాభై వేల కోట్ల రూపాయాల్ని వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. చాలా కాలంగా జెన్కోస్, డిస్కంలకి చెల్లింపులు జరపకపోవడం వలన.. అవి ఆర్ధికంగా ఒత్తిడి ని ఎదుర్కొంటున్నాయని దీని వలన ఆయా సంస్థలు బొగ్గు సరఫరా దారులకి, కాంట్రాక్టర్స్ కి ఆయా సంస్థలు బకాయిలు తీర్చలేకపోతున్నాయని దాంతో ఆయా సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా జెన్కో లు, డిస్కంలు సమయానికి తగ్గట్లుగా తమ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్స్ ని అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నెలల తరబడి బకాయిలు చెల్లించకుండా జాప్య చేస్తుండడం వలన అప్గ్రేడ్ పనులు నిలిపివేయాల్సి వస్తున్నది. దీని వలన ఆపరేషనల్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. విద్యుత్ రవాణా నష్టాలు అన్ని దేశాల కంటే మన దేశంలో ఎక్కువగా ఉంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో విద్యుత్ రవాణా నష్టం [వేస్టేజ్ ] 5% నుంచి 8% శాతం మధ్యన ఉండగా అదే మన దేశంలో విద్యుత్ రవాణా నష్టం 20% శాతంగా ఉన్నది. ఎప్పటికప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటే విద్యుత్ ట్రాన్స్మిషన్ నష్టాలని తగ్గించుకోవడానికి వీలుపడుతుంది. కానీ దానికి భారీగా నిధుల అవసరం ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బకాయిళ్లను సకాలంలో చెల్లించకుండా జాప్యం చేస్తుండడంతో విద్యుత్ సంస్థలకి నిధుల కొరత ఏర్పడుతున్నది. మరోవైపు విద్యుత్ సంస్థలకి బకాయిలు సకాలం లో చెల్లించకపోవడం వలన విద్యుత్ ఉత్పాదన మీద కూడా దాని ప్రభావం పడి పూర్తి సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఈ ఏడాది వేసవి కాలంలో చాలా రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతని ఎదుర్కున్నాయి. వీటిలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
జూన్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ రికార్డ్ గా నమోదు అయ్యింది. ఆ రోజున 2,10,793 మెగా వాట్ల డిమాండ్ ఏర్పడింది దాంతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఈ డిమాండ్ ని తట్టుకోలేక డిస్కంలని పవర్ కట్ చేయమని కోరాయి దాంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
ఏఏ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎంత బకాయి పడ్డాయి ?
కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాల వారీగా విద్యుత్ బకాయిల వివరాలు వెల్లడించింది:
జెన్కో లకి ఇవ్వాల్సిన బకాయిల వివరాలు:
1. మహారాష్ట్ర : 21వేల 500 కోట్ల రూపాయిలు ఆ రాష్ట్ర జెన్కోకి బకాయి పడ్డది. ఇది దేశం లో మొదటి స్థానం లో ఉంది.
2. తమిళనాడు : 10,990 కోట్లు బకాయిలు పడ్డది ఆ రాష్ట్ర జెన్కోకి. ఇది దేశంలోనే అత్యధిక బకాయిలు లో రెండవ స్థానం లో ఉంది.
3. ఆంధ్రప్రదేశ్: 10,709 కోట్ల రూపాయలు జెన్కోకి బకాయిలు పడ్డది. ఇది దేశంలోనే అత్యధిక బకాయిలలో మూడవ స్థానంలో ఉంది.
డిస్కం లకి బకాయిలు ఉన్న రాష్ట్రాలు :
4. తెలంగాణ రాష్ట్రం డిస్కం కి ఇవ్వాల్సిన బకాయిలులో ప్రధమ స్థానంలో ఉంది. మొత్తం 11,935 కోట్ల రూపాయాలు డిస్కం లకి చెల్లించాల్సి ఉంది.
5. మహారాష్ట్ర డిస్కం లకి ఇవ్వాల్సిన బకాయిలులో రెండవ స్థానం లో ఉంది. మొత్తం 9,131 కోట్ల రూపాయల బకాయిలు ఉంది డిస్కం లకి.
6. ఆంధ్ర ప్రదేశ్ డిస్కం లకి ఇవ్వాల్సిన బకాయిలులో కొద్ది తేడాతో మూడవ స్థానంలో ఉంది. మొత్తం 9,116 కోట్లరూపాయలు డిస్కంలకి బకాయులు పడ్డది. మహారాష్ట్రకి ఆంధ్రప్రదేశ్ కి మధ్య తేడా కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే.
7. విద్యుత్ జెన్కో లు, డిస్కంల బకాయులు కాకుండా వివిధ స్కీమ్ ల[సబ్సిడీలు ] కింద ఇతర పధకాల కింద రాష్ట్రాలు బకాయిలు పడ్డది అక్షరాల 76,339 వేల కోట్ల రూపాయలుగా ఉంది అని కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి.
8. రాజస్థాన్ డిస్కంలకి బకాయిలు పడ్డ మొత్తం : 15,597 కోట్ల రూపాయలు.
9. పంజాబ్ డిస్కంలకి బకాయులు పడ్డ మొత్తం : 9,020 కోట్ల రూపాయలు.
అసలు ఉచిత విద్యుత్ అనేది ఎక్కడా ఉండదు ! విద్యుత్ ఉచితంగా ఉత్పత్తి అవుతుందా ?100 యూనిట్లు లేదా 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని వోట్లు వేయించుకొని ఆపై జెన్కోలకి, డిస్కంలకి చెల్లింపులు చేయడానికి డబ్బు ఉండడం లేదు రాష్ట్రాలకి ! ఇది చాలా ప్రమాదకరమయిన ఉచిత హామీ ! కనీసం ఉత్పత్తి, సరఫరాకి ఎంత ఖర్చు అవుతుందో దానినే బీద వాళ్ళకి ఇస్తే సరిపోతుంది ఇతర ఛార్జీలు లేకుండా కానీ ఆపని చెయ్యవు రాష్ట్రాలు. తీరా డబ్బులు కట్టాల్సి వచ్చే సరికి చేతులు ఎత్తేయడం లేదా కేంద్రం బొగ్గు సరఫరా చేయట్లేదని నెపం కేంద్రం మీదకి నెట్టేస్తున్నారు కానీ తాము జెన్కోలకి, డిస్కంలకి ఎంత బకాయిలు ఉన్నదీ ఏ రాజకీయ పార్టీ కూడా బహిరంగంగా చెప్పవు. బొగ్గు దిగుమతి చేసుకోవాలంటె తమ దగ్గర నిధులు లేక ముందుగా ఆర్డర్ ఇవ్వకపోవడం తీరా డిమాండ్ పెరగగానే బొగ్గు సరఫరా చేయట్లేదు అని కేంద్రం మీద నింద వేయడం పరిపాటిగా మారింది.
బొగ్గు విషయం మీద కొన్ని వాస్తవాలు !
మొత్తం 4 రకాల బొగ్గు దొరుకుతుంది.
1. లీగ్నైట్ బొగ్గు లేదా లిగ్నైట్ కోల్ అనేది లో ర్యాంక్ బొగ్గు. నల్లగా, కొద్దిగా గ్రే కలర్ తో పాటు బ్రౌన్ కలర్ లో కూడా ఉంటుంది లీగ్నైట్ బొగ్గు. దీనిని ప్రధానంగా విద్యుత్ ఉత్పాదన కోసం వాడతారు. ఈ బొగ్గు లో కార్బన్, సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటుంది అంటే దీనిని కాలిస్తే కాలుష్యం ఎక్కువగా ఉంటుంది పైగా బూడిద ఎక్కువగా విడుదల చేస్తుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా దొరికే బొగ్గులో 17% లీగ్నైట్ బొగ్గు వాటా ఉంది.
2. సబ్ బిటుమనస్ [subbituminous] బొగ్గు. ఈ బొగ్గులో సల్ఫర్, కార్బన్ శాతం తక్కువగా ఉంటుంది. పర్యావరణానికి ఎక్కువ హాని చేయదు దీనిని మండించినప్పుడు. పైగా బూడిదని తక్కువగా విడుదల చేస్తుంది. ఈ బొగ్గుని కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం, ఇతర పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం బొగ్గు నిల్వలలో ఇది 30% ఆక్రమిస్తున్నది.
3. బిటుమినియస్ [bituminous ] బొగ్గు. ఇది చాలా గట్టిగా, నల్లగా ఉంటుంది పైన చెప్పిన రెండు రకాల బొగ్గులకంటే. దీనిలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి.. అవి థర్మల్, మెటలర్జికల్. దీనిలో థర్మల్ అనేది విద్యుత్ ఉత్పాదన కోసం, ఇతర సిమెంట్ పరిశ్రమలలో వాడతారు. మెటలర్జికల్ బొగ్గుని ముడి ఇనుములో కలిపి ఇనుము, స్టీల్ ని ఉత్పత్తి చేయడానికి వాడతారు. మొత్తం ప్రపంచ బొగ్గు నిల్వలలో ఇది 52% ఆక్రమిస్తున్నది.
4. ఆంత్రాసైట్ [Anthracite] బొగ్గు. బొగ్గుతో నడిచే రైలు ఇంజిన్ లలో ఈ బొగ్గునే వాడతారు అలాగే ఇళ్ళలో బొగ్గుతో వంట చేసే స్టవ్ లలో ఈ బొగ్గునే వాడతారు. అలాగే చిన్న చిన్న ఫర్నెస్ లలో కూడా ఈ బొగ్గుని వాడతారు. మిగతా బొగ్గు రకాలతో పోలిస్తే ఈ బొగ్గులో కార్బన్ శాతం చాలా ఎక్కువ.
ఇక బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఒక్కో కేంద్రం ఒక్కో రకం బొగ్గుని వాడతాయి అలాగే కాలుష్యాన్ని నివారించే కేటలిక్ కన్వర్టర్స్ ని అమర్చేటప్పుడు తాము ఏ బొగ్గుని వాడుతామో దానికి సంబంధించిన కేటలిక్ కన్వర్టర్ ని ఎంచుకుంటారు కాబట్టి అన్ని బొగ్గులు ఒకే రకం కాదు. వేటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. అందుకే కొన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది.
భారత ప్రభుత్వ విధాన నిర్ణయం !
మన దేశంలో ఉన్న బొగ్గు నిల్వలని వాడుకుంటూ అదే సమయంలో విదేశాల నుంచి బొగ్గుని దిగుమతి చేసుకుంటూ మన దేశంలోని బొగ్గు నిల్వలు పూర్తిగా అయిపోకుండా సమతూకం చేయాలి అని. ఈ పద్దతిని చాలా దేశాలు పాటిస్తున్నాయి తమ దేశాలలో బొగ్గు నిల్వలు ఉన్నా బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి ఇప్పటికీ!
అంతే కానీ మోదీ విదేశాల నుంచి బొగ్గుని దిగుమతి చేసుకోవాలని సూచిస్తున్నాడు అంటూ విమర్శలు చేసే వెధవలకి సమాధానం ఇది. అసలు ఏ రకం బొగ్గుని ఏ థర్మల్ విద్యుత్ కేంద్రం వాడుతుందో తెలియకుండా విమర్శలు చేస్తే ఎలా ? సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలకి అయితే షిప్ లో బొగ్గు దిగుమతి చేసుకొని పోర్ట్ నుంచి లారీలలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకి రవాణా చేయడం చాలా తేలిక ఖర్చు తక్కువ కూడా. ఎన్ని గూడ్స్ వాగన్ లు అయితే ఒక షిప్ తో సామానం అవుతుంది? పైగా గూడ్స్ వాగన్ ల నుంచి మళ్ళీ లారీలలో లోడ్ చేసి సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ముందు జెన్కోలకి, డిస్కంలకి ఎప్పటి బిల్లు అప్పుడు క్లియర్ చేస్తే ఆయా సంస్థలు ముందుగానే బొగ్గుని స్టాక్ పెట్టుకుంటాయి.
~ పార్ధసారధి పోట్లూరి