మూడోసారి అధికారులకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్యరంగంలోకి దిగిపోయింది. చేయాలనుకున్న పనులు వచ్చాక చేసుకుంటూ పోతుంది.
కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న కొత్త న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు కేంద్ర ప్రభుత్వం ఇక చెల్లు చీటీ పాడనుంది. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా రాజద్రోహం వంటి చట్టాలను తొలగిస్తున్నారు . కొత్త చట్టాలతో 90 శాతానికి పైగా నేరగాళ్లకు శిక్షలు ఖాయం కావచ్చు.
దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటీష్ పాలకుల కాలంలో తీసుకువచ్చిన సీఆర్పీసీ, స్వాతంత్రం అనంతరం తెచ్చిన ఐపీసీ చట్టాల ద్వారానే ఇప్పటివరకు నేరం చేసిన వారికి కోర్టులు శిక్షలు విధిస్తున్నాయి. 1860 నుంచి 2023 వరకు దేశంలో న్యాయ వ్యవస్థ.. బ్రిటీషర్లు రూపొందించిన విధంగానే అమలు అయ్యింది.
ఆ మూడు చట్టాలను మార్చేసి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లో పెను మార్పులు తీసుకురానున్నారు . ఈ క్రమంలోనే ఇప్పటికే చాలాసార్లు సుప్రీంకోర్టు సహా వివిధ హైకోర్టులు కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ప్రస్తుతం ఉన్న మూడు చట్టాలు బ్రిటీష్ పాలనను రక్షించడం, బలోపేతం చేయడంతో పాటు శిక్షించడం తప్ప న్యాయం చేయడం కాదని తెలిపారు. వాటిని భర్తీ చేయడం ద్వారా, కొత్త మూడు చట్టాలు భారత పౌరుల హక్కులను పరిరక్షించే స్ఫూర్తిని తీసుకువస్తాయి. పౌరులను శిక్షించడం లక్ష్యం కాకుండా ,, న్యాయం కల్పించడమే ఈ కొత్త చట్టాల లక్ష్యం. సమాజ సేవను శిక్షగా గుర్తించడం, దర్యాప్తులో సాంకేతికత, ఫోరెన్సిక్ సైన్సెస్ను ఉపయోగించడం, ఎలెక్టానిక్ పద్ధతి ద్వారా సమన్లు జారీచేయడం, ఎలెక్టానిక్, డిజిటల్ రికార్డులను సాక్షంగా అంగీకరించడం వంటివి ఈ బిల్లులో ప్రభుత్వం పొందుపరిచింది.
ఇండియన్ పీనల్ కోడ్ – ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. ఇక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ – సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం తెస్తున్నారు .
బ్రిటీష్ కాలంలో చేసిన కాలం చెల్లిన చట్టాలను ప్రక్షాళన చేస్తున్నారు., ఇందులో భాగంగానే రాజద్రోహం వంటి చట్టాలను తొలగిస్తున్నారు. కొత్తగా తీసుకురానున్న చట్టాలతో 90 శాతంపైగా నేరగాళ్లకు శిక్షలు ఖాయంగా పడతాయి. ఏడేళ్లకు పైగా శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్ తనిఖీ తప్పనిసరి చేస్తున్నారు.
కొత్త చట్టాలతో శిక్షను పెంచడం కాదు అని, న్యాయం దొరికేలా రూపొందించినట్లు ఆయన తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం మైనర్ను రేప్ చేస్తే మరణశిక్ష విధించనున్నారు. ఇక గ్యాంగ్ రేప్కు పాల్పడితే 20 ఏళ్లు లేదా జీవితఖైదు శిక్ష విధించనున్నారు. సామూహిక దాడి కేసుల్లోనూ మరణశిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తమ్మీద కొత్త చట్టం రాకతో మోదీ మార్కు పాలన ఊపందుకుంటుందని భావిస్తున్నారు.