ప్రధాని మోదీపై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసిందేంలేదన్నారు. మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదిరి పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. యాదాద్రి జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మత పిచ్చి బీజేపీ సిద్ధాంతమని…ప్రజాసమస్యలనుపక్కనపెట్టి ప్రధాని రాజకీయం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మోదీ చేతగానితనం వల్లే తెలంగాణకూడా సమస్యలువస్తున్నాయన్నారు. అభివృద్ధిలో భారత్ స్థానం 101 అయితే దేశంలో అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు.