ప్రజల కోసమే ప్రజల కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు ముఖ్యంగా విద్య వైద్యం కోసం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య దిశగా విపరీతంగా కృషి చేసినట్లు ఆయన తెలిపారు.
“2014 వరకు 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్ సౌకర్యాలు లేవు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి టాయిలెట్లు అందించిన రాష్ట్రంగా హర్యానా నిలిచింది. దానికి హర్యానా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో విశేష కృషి చేసింది. ప్రజారోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ కేంద్రాల కోసం రూ. 64 వేల కోట్లు ఖర్చు చేశాం” అని అమిత్ షా తెలిపారు.
ఇందుకోసం జరిగిన కృషిని ఆయన వివరించారు.
“గత పది సంవత్సరాల్లో 700కిపైగా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు, 382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 602 క్రిటికల్ కేర్ బాక్స్లు స్థాపించాము. నేడు దేశంలో 23 ఎయిమ్స్ ఆసుపత్రులు ఉన్నాయి. గతంలో వైద్య విద్యార్థులకు కేవలం 51 సీట్లు మాత్రమే ఉండేవి. నేడు వాటి సంఖ్యను 1,15,000కి పెంచాము. రాబోయే ఐదు సంవత్సరాల్లో మరో 85 వేల సీట్లను పెంచనున్నాం” అని అమిత్ షా వివరించారు.
గతంలో హర్యానాలో కులతత్వం కారణంగా ఉద్యోగాలలో అవినీతి పెరిగిపోయి రాష్ట్ర పరువుపోయిందని, కానీ బిజెపి ప్రభుత్వ హయాంలో 80 వేల ఉద్యోగాలు ఇచ్చి ప్రజాస్వామ్యంలో కులం ఆధారంగా రాజకీయాలు జరగవని నిరూపించిందని అమిత్షా తెలిపారు.
రానున్న కాలంలో ప్రజల కోసం మరింత పనిచేస్తామని అమిత్ షా వివరించారు.