మోదీని తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్. ఇద్దరూ కలిసిన సందర్భంలో వారిమధ్య సాగిన సరదా సంభాషణ అది. మీకు ఇజ్రాయెల్లో మంచి ఆదరణ ఉంది…మా యామినాపార్టీలో చేరండి అంటూ బెన్నెట్ సరదాగా ఆహ్వానించారు.
ఇక ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాల గురించి అందరికీ తెలుసు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధం ఏర్పడి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత్ కు రావాలని బెన్నెట్ ను మోదీ ఆహ్వానించారు. ఇజ్రాయెల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బెన్నెట్ మోదీతో భేటీ అవడం ఇదే మొదటిసారి. భేటీలో ప్రధానంగా…అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవసాయం, అంతరిక్షం, భద్రత విషయాలపై చర్చలు జరిపారు. ఇంతకుముందులానే ఇరుదేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని….వివిధ రంగాల్లో ఇరుదేశాలు కలిసి నడుస్తాయని ఆకాంక్షించారు.
\