జర్మనీలోని మ్యూనిచ్లో జీ7 సదస్సులో పాల్గొన్న మోదీ..అటు నుంచి యూఏఈ పర్యటనకు వెళ్లారు.
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీలోని G7 సమ్మిట్ పర్యటనను ముగించారు, ప్రపంచ సవాళ్లకు స్థిరమైన పరిష్కారాలపై రెండు రోజుల చర్చల్లో పాల్గొన్నారు. అటు నుంచి ఆయన అబుదాబి వెళ్లారు. అక్కడినుంచి నేరుగా డిల్లీ వస్తారు ” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అని ట్వీట్ చేశారు.
PM @narendramodi concludes his visit to Germany for the G7 Summit, wrapping up two days of productive discussions on sustainable solutions to global challenges.
PM Modi now emplanes for Abu Dhabi for a brief stopover before reaching New Delhi. pic.twitter.com/QVJqO2ThRk
— Randhir Jaiswal (@MEAIndia) June 28, 2022
2004 నుంచి పదవిలో ఉంటూ ఇటీవలే మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నైహాన్ కు నివాళి అర్పించేందుకు మోదీ అబుదాబి వెళ్లారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతూ… 73 ఏళ్ల వయసులో ఇటీవలే కన్నుమూశారు నైహాన్. UAE కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నైహాన్తో ప్రధానమంత్రి సమావేశం కావడం కూడా ఇదే తొలిసారి.