కేంద్రంలో మరోసారి బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరుతోంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో 400 స్థానాలు దక్కించుకోవాలని బిజెపి తీవ్రంగా శ్రమించినప్పటికీ.. 300 లోపే నిలిచిపోవడం గమనార్హం.
బిజెపి మరోసారి గెలుపొందేందుకు అనేక అంశాలు దోహద పడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశ భద్రత విషయంలో పటిష్టమైన దేశంగా భారత్ నిలిచింది దీనికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న గట్టి చర్యలే అని చెప్పుకోవాలి. ఈ పదేళ్ల కాలంలో ఉగ్రవాదుల చర్యలకు బ్రేక్ పడింది అన్నది వాస్తవం. జమ్మూ కాశ్మీర్ ను పూర్తి శాంతియుత రాష్ట్రంగా మార్చగలిగారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అయోధ్య రామ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించారు. భవ్యమైన రామ మందిరం నిర్మాణం కావడంలో మోదీ సర్కార్ సమన్వయం బాగా పనిచేస్తుంది. అలాగే వారణాసి అయోధ్య మధుర ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలు మౌలిక వసతులు బాగా మెరుగుపరిచారు చక్కటి పుణ్యక్షేత్రాలు తీర్చిదిద్దారు.
దేశవ్యాప్తంగా కూడా మౌళిక వసతుల్ని అభివృద్ధి చేశారు. విశాలమైన జాతీయ రహదారుల్ని అందుబాటులోకి తెచ్చారు విస్తారంగా ఫ్లై ఓవర్లు నిర్మించారు. ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో పర్వత ప్రాంతాల్లో ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టించారు. కరోనా వంటి కష్ట కాలంలో టీకాలను అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజలకు అండగా నిలిచారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే గడచిన పది సంవత్సరాలలో ఒక్క అవినీతి స్కాం కూడా లేనేలేదు. పారదర్శకత కు మారుపేరులా పాలన నడిచింది.
ఇన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా బిజెపి అనుకున్నంతగా రాణించలేకపోయింది. ముఖ్యంగా బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి అన్న ప్రతిపక్షాల ప్రచారం చాలా చేటు తీసుకొని వచ్చింది. రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్ మధ్యప్రదేశ్ పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో బిజెపి ఘోరంగా దెబ్బతింది. రాజకీయంగా ఎత్తుగడలు వేసిన ఒడిశా ఆంధ్రప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాలు ఎన్డీఏకి కలిసి వచ్చాయి. ఎన్నికల ముందు బలవంతంగా పొత్తులు కుదుర్చుకున్న తెలుగుదేశం జెడియూ పార్టీలు ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా నిలుస్తున్నాయి. కర్ణాటక తెలంగాణలో బిజెపి బలపడడం కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి.
మొత్తం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువు తీరడం ఖాయం అయింది అయితే బలమైన ప్రభుత్వం ఏర్పాటు కాలేదు అనేది అంతే సత్యం.