మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రకరకాల వదంతులు ప్రచారం లోకి వచ్చాయి. బిజెపి పార్టీ చాలా సీట్లను కోల్పోయిందని,, మోదీ ప్రభుత్వం చతికిల పడిందని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం జెడిఈ వంటి ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యలతో ప్రభుత్వం నడుస్తోందని,, అందుచేత మోదీ ప్రభుత్వం నెగ్గుకుని రావటం కష్టమని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం కూలిపోయినా కూడా ఆశ్చర్యపోవనవసరం లేదు అని చెబుతున్నారు. మొత్తం మీద లీటర్ల కొద్దీ బురదను సోషల్ మీడియా వేదికగా మోడీ ప్రభుత్వం మీద పోసేస్తున్నారు.
కానీ ఢిల్లీ పరిణామాల్ని దగ్గరనుంచి చూస్తే ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని అర్థమవుతుంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో మూడోసారి అధికారులకు రావడం చాలా చాలా కష్టమైన విషయం. అందునా భారత్ లాంటి భారీ జనాభా మన దేశంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి గెలుపు సాధించడం గొప్పతనం.
నిజానికి తక్కువ మెజార్టీతో ప్రభుత్వాలు నడవడం భారత్ లో కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా అర కొర మెజార్టీతోటే .. నెట్టుకొచ్చేసేయ్. పివి నరసింహారావు ప్రభుత్వం అయితే మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు లాగించేశారు. అందుచేత ప్రభుత్వానికి వచ్చిన బెంగేమీ లేదు ఇది మొదటి పాయింట్.
ఇక, మోదీ నిరసించి పోయారు అన్న వాదన కూడా శుద్ధ తప్పు. ఈసారి క్యాబినెట్ ని గమనించినట్లయితే కొన్ని సంచలన విషయాలు బయట పడతాయి. కీలకమైన మంత్రిత్వ శాఖలో పాత మంత్రులనే కొనసాగిస్తున్నారు. హోం మంత్రిగా అమిత్ షా , రక్షణ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్, ఉపరితల రవణ శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ, విదేశాంగ మంత్రిగా జయశంకర్, విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ వంటి కరుడుగట్టిన బిజెపి నాయకులు కొనసాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ సొంత టీం మూడోసారి కూడా పరిపాలన చేయబోతోంది.
ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. పరిపాలన మీద పట్టు మరింత బిగించేందుకు మోడీ మరో మార్గం నేర్చుకున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి పరిపాలన మీద పట్టు తెచ్చుకున్న నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఈసారి క్యాబినెట్లో మాజీ సీఎంలు ఏడెనిమిది మంది దాకా ఉన్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనతోపాటు రాజ్ నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహన్, మనోహర్ లాల్ కట్టర్, జెడి కుమార్ స్వామి, జితేందర్ రామ్, శర్వానంద్ వంటి మంత్రులు వివిధ రాష్ట్రాల్లో సీఎంలుగా వ్యవహరించారు. అందుచేత పరిపాలన చేయడం, బ్యూరోక్రసీ నీ అదుపులో పెట్టడం సాధ్యమవుతుంది.
నరేంద్ర మోడీ మంత్రివర్గం కూర్పును చూస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో దుమారాలు, ప్రచారాల్ని పట్టించుకోకుండా
తాము అనుకున్నా పనుల్ని పటిష్టంగా చేస్తారు అని తెలుస్తోంది. ప్రభుత్వం మీద, పాలన మీద పట్టు ఉంది కాబట్టే నరేంద్ర మోడీ మార్కు కేబినెట్ అధికారాన్ని చేపట్టింది. అందుచేత మోదీ వీక్ అయిపోయారు, ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద నడుచుకుంటారు, అనేక మందితో విభేదాలు వచ్చి వెనకబడ్డారు అన్న వాదనలన్నీ వట్టి అబద్ధాలు. మూడోసారి కూడా పటిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన్ని అందించేందుకు మోడీ టీం చక చక ముందుకు సాగుతోంది.