గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయానికి గుర్తుగా సూరత్ కు నగల వ్యాపారి బసంత్ బోహ్రా అనే నగలవ్యాపారి నరేంద్రమోదీ బంగారు ప్రతిమను చేయించారు. 18 క్యారెట్ల 156 గ్రాముల బంగారంతో దాన్నితయారు చేశారు. దీనిని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్ లో పెట్టారు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 156 సీట్లు గెలుచుకుంది. దీనికి గుర్తుగా 156 గ్రాముల బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఈ విగ్రహం 4.5 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పుతో ఉంది.
బంగారు-వెండి ఆభరణాల తయారీ కంపెనీ రాధికా చైన్స్ యజమాని అయిన బసంత్ బోహ్రా స్వస్థలం రాజస్థాన్.
ఈ విగ్రహం తయారీకి పదిన్నర లక్షల రూపాయలు అయినట్టు ఆయన తెలిపారు. మోదీమీద అభిమానంతో విగ్రహాన్ని తీర్చిదిద్దినట్టు చెప్పారు.