ఇవాళ అమెరికా బయల్దేరిన భారత ప్రధాని 24న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భేటీ కానున్నారు. వాషింగ్టన్లో వారి సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆఫ్గనిస్తాన్ పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం, భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలబలోపేతంపై వారిద్దరూ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ భారత ప్రధానితో భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి. మోదీ ఈ నెల 26న భారత్కు తిరిగి వస్తారు. వాషింగ్టన్లో ‘క్వాడ్’ నేతల సదస్సులోనూ, 25న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 76వ సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.
ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులతోనూ ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేపట్టాల్సిన సంస్కరణలు బైడెన్–మోదీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం వెళ్తోంది.