ట్విట్టర్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ముందు నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ, క్రికెటర్ సచిన్ టెండుల్కర్. బ్రాండ్ వాచ్ నిర్వహించిన వార్షికపరిశోధనలో మోదీ రెండోస్థానంలో, సచిన్ 35 వ స్థానంలో నిలిచారు. అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలవగా… అమెరికన్ నటులు డ్వేన్ జాన్సన్, లియోనార్డో డి కాప్రియో, యునైటెడ్ స్టేట్స్ మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామాకి జాబితాలో చోటు దక్కింది. స్వదేశంలో 70 శాతం మంది మద్దతుతో అత్యంత ఎక్కువగా ప్రజాకర్షణ గల దేశాధినేతలతో మొదటివారుగా వచ్చిన మోదీకి ట్విట్టర్ లో 72.5 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు.
సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో 36.2 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. క్రికెటర్ గా మరెవ్వరు అధిగమించలేని పలు రికార్డులు సచిన్ సొంతం. బ్రాండ్వాచ్ తమ బ్రాండ్ల ఆన్లైన్ ఉనికిని విశ్లేషించడానికి కంపెనీలకు సమాచారం అందించడానికి సోషల్ మీడియా డేటాను ఉపయోగిస్తుంది.

file photo