పాకిస్తాన్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. ఈసారి చేసిన దాడి సైనిక దాడి కాదు,, మేధోపరమైన దాడి చేశారు. మోదీ చేసిన తాజా సర్జికల్ స్ట్రైక్స్ తో… పాకిస్థాన్ అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది. పాకిస్తాన్ బండారం మొత్తంగా మోదీ బయటపెట్టేశారు.
……
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదంపూర్ పర్యటన వెనక గొప్ప స్ట్రాటజీ ఉంది. ఇది తెలుసుకోవాలంటే మరో రెండు మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి.
భారత్ సైనిక దళాల దెబ్బకు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది. శత్రుదేశంలో పదకొండు ఎయిర్ బేస్ లను భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ ఫోటోలను కూడా భారత సైనికాధికారులు విడుదల చేశారు. దీంతో పాకిస్తాన్ పరువు మురికి కాలవలో కలిసిపోయింది. యుద్ధం చేయడానికి పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు ఏమీ లేవని అందరికీ అర్థం అయిపోయింది.
……………
ఇక్కడే పాకిస్తాన్ ఒక చీఫ్ ట్రిక్ ప్రయోగించింది. తాము కూడా గట్టిగానే యుద్ధం చేశామని, భారత్ మీద దాడులు చేశామని అబద్ధాలు మొదలుపెట్టింది.
తాము కూడా భారత దేశం లోని ఎయిర్ బేస్ లను ధ్వంసం చేశామని పాకిస్తాన్ వైమానిక దళం చీఫ్ ఔరంగజేబు గొప్పగా ప్రకటించారు. అదంపూర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ను నాశనం చేశామని ,, భారత్ కీలక రక్షణ వ్యవస్థ అయిన S400ను ధ్వంసం చేశామని ఘనంగా ప్రకటనలు చేశారు. ఇందుకు సాక్ష్యం అంటూ మార్ఫింగ్ చేసిన కొన్ని ఫోటోలు కూడా పాకిస్తాన్ వైమానిక అధికారి విడుదల చేశారు.
………
పాకిస్తాన్ దొంగ నాటకాలను భారత్ సీరియస్ గా తీసుకుంది. ఇదే అదనుగా శత్రువుకి బుద్ధి చెప్పడానికి మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. ఉదయమే ఆకస్మిక పర్యటనకు అదంపూర్ ఎయిర్ బేస్ ని ఎంచుకున్నారు.
మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ విమానం అదంపూర్ బేస్ లో చక్కగా ల్యాండ్ అయింది.
ఎయిర్ బేస్ అంతా నరేంద్ర మోడీ కలియ తిరుగుతున్నప్పుడు అక్కడ అంబియన్స్ అంతా చాలా ప్రశాంతంగా ఉందని,, ఏమాత్రం చెక్కు చెదరలేదు అని కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.
మోదీ ప్రసంగించినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఎస్ 400 సిస్టమ్ ఉంది. అలాగే యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. ఆ ఎయిర్ బేస్ కు కొంచెం కూడా నష్టం జరగలేదని స్పష్టమయింది.
………..
ఇక అక్కడి నుంచి ప్రధాని మోదీ పాకిస్తాన్ కి మరోసారి వార్నింగ్ ఇచ్చారు పిచ్చి వేషాలు వేస్తే అంతు చూడటం ఖాయం అని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే … మరోసారి చొరబడి కొడతామని,, ఈసారి దాడి చేస్తే పాకిస్తాన్ కి ఏది మిగలదు అని… ఘాటుగా హెచ్చరికలు చేశారు.
……..
ఈ దెబ్బకు పాకిస్తాన్ పరువు మురికి కాలంలో కలిసిపోయింది. పాకిస్తాన్ చెప్పేదంతా అబద్ధం చేసేదంతా మోసమని స్పష్టంగా తేలిపోయింది. మేధో పరంగా మోదీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్… పాకిస్తాన్ గుండెల మీద తన్నినట్లు అయింది.