సమాజ్వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం అన్సారీకి సీఎం యోగీని కలిశారు. కొద్ది రోజుల క్రితం షాజిల్ కు చెందిన అక్రమ పెట్రోల్ పంపును అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దాని లైసెన్స్ సహా అన్ని నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్లను (NOCలు) రద్దు చేశారు. ఇప్పుడాయన సీఎం యోగి ఆదిత్యనాథ్ను సహాయం కోసం కలిశాడు. ఇదే ఎమ్మెల్యే గతంలో “యోగి ఏదైనా శబ్దం చేస్తే.. ఎస్పీ ఇక నుంచి పొగలు గక్కదు, బుల్లెట్లను విడుస్తుంది”అని హెచ్చరించాడు. షాజిల్ ఇస్లాం బరేలీలోని భోజిపురా శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాను యోగిని కలిసింది నిజమేనని అంగీకరించారు షాజిల్. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారనీ తెలిపారు.
తమ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించినట్లు ఎస్పీ ఎమ్మెల్యే తెలిపారు. భోజిపురాలోని బిల్వా జిల్లాలో వ్యవసాయ శాఖకు విస్తారమైన భూమి ఉందని సీఎంకు వివరించారు. ప్రభుత్వం అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వైద్య పాఠశాల ఏర్పాటు చేయవచ్చని సీఎంతో అన్నట్టు చెప్పాడు.
BDA బుల్డోజర్తో బరేలీ-ఢిల్లీ జాతీయ రహదారిపై పర్సఖేడా వద్ద ధ్వంసం చేసిన తన పెట్రోల్ పంపు లైసెన్స్లు, NOCలను పొందేందుకు అధికారులకు రూ. 10 లక్షలు చెల్లించినట్లు షాజిల్ ఇస్లాం పేర్కొన్నాడు. బరేలీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఏప్రిల్ 7న భారీ పోలీసు భద్రత మధ్య బుల్డోజర్తో పెట్రోల్ పంప్ దగ్గరకు వెళ్లారు. క్లియరెన్స్ లేకుండా నిర్మించడంతో స్థానిక పోలీసులు, పీఏసీ అధికారుల సమక్షంలో నిర్మాణాన్ని కూల్చివేశారు. జిల్లా కార్యాలయం కొన్ని రోజుల తర్వాత దాని లైసెన్స్, నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్లను కూడా రద్దు చేసింది. పెట్రోల్ స్టేషన్ను నిర్మించిన స్థలం ఎవరి యాజమాన్యంలో ఉందో పరిశీలించాలని ప్రభుత్వం నగర అదనపు జిల్లా మేజిస్ట్రేట్ను కూడా కోరింది.
https://twitter.com/ANINewsUP/status/1511986722539962373?s=20&t=C7ZNrF81caKWKJNhaj648A
జిల్లా మెజిస్ట్రేట్ శివకాంత్ ద్వివేది ప్రకారం, అన్సారీకు చెందిన పెట్రోల్ పంప్కు లైసెన్స్, ఎన్ఓసిలు ఇచ్చిన షరతులు నెరవేరలేదు, అందుకే వాటిని రద్దు చేశారు. అన్సారీకి చెందిన పెట్రోల్ పంపుపై భారత్ పెట్రోలియం తనదైన స్థాయిలో చర్యలు తీసుకోవాలని ద్వివేది ఆదేశించారు.