సాక్షాత్తూ ఓ ఎంపీకే అవమానం ఎదురైంది. అదీ ఓ మహిళకు. అందులోనూ ఆమె అధికార పార్టీ కూడా. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అవమానించారు. ఆమె మాట్లాడతుండగా అక్కడికి వచ్చిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆమె చేతిలోని మైక్ లాక్కున్నారు. ఆమె తాను మాట్లాడుతున్నా కదా అన్నా వినకుండా నేను మాట్లాడాలి అని పరుషంగా బిహేవ్ చేస్తూ మైక్ లాగేసుకున్నారు. ఆ సమయంలో మంత్రి సత్యవతిరాథోడ్, స్థానిక నేత తక్కళ్లపల్లి రవీందర్ అక్కడే ఉండడం గమనార్హం. అయితే ఎవరూ కూడా ఎమ్మెల్యేను ఇదేంటని అడిగే సాహసం చేయలేకపోయారు.
శంకర్ నాయక్ కు వివాదాలు కొత్తకాదు. గతంలో జిల్లా కలెక్టర్ తో ఆయన వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఇటీవలే హోలీ సందర్భంగా కార్యకర్తలకు మద్యం పంచడం వార్తల్లో వచ్చింది. ఇక తాజాగా ఓ మహిళా ఎంపీ చేతిలో నుంచి మర్యాదలేకుండా మైకు లాక్కున్న వీడియో వైరల్ అవుతోంది.