ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా విమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ పాలిటిక్స్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటిక్రితం హైదరాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో భేటీ అయ్యారామె. నోవాటెల్ లో దాదాపు అరగంటపాటు వారిద్దరూ సమావేశమయ్యారు. భేటీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ , లక్ష్మణ్ పాల్గొన్నారు.అయితే భేటీ అనంతరం బయటకు వచ్చిన మిథాలీ మీడియాతో ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. విమెన్ క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్న 39 ఏళ్ల మిథాలీ రాజ్ ఇటీవలే రిటైర్మెట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెప్పిన ఆమె త్వరలో రాజకీయాలబాట పట్టవచ్చనే చర్చ కొన్నిరోజులుగా నడుస్తోంది. ఈనేపథ్యంలో ఆమె బీజేపీ చీఫ్ ను కలవడం ఆసక్తిగా మారింది.
https://twitter.com/JPNadda/status/1563452610010841089?s=20&t=N096DlGyI0wiZJ3s7lLCUw