టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డుప్రమాదంలో చనిపోయారు.అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ బెంజ్ రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో పాల్ఘర్ జిల్లాలో సూర్యనది వంతెనపై ఈ ఘోరం జరిగింది. ప్రమాదస్థలిలోనే ఆయన కన్నుమూశారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తేలింది. రాంగ్ రూట్ లో మరో వాహనాన్ని ఎడమ వైపునుంచి ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రయాణ సమయంలో మిస్త్రీ సీటుబెల్ట్ పెట్టుకోలేదని ప్రాథమిక విచారణ లో తేలింది. వెనకసీట్లో ఉన్న ఆయన బెల్ట్ పెట్టుకుని ఉంటే ఎయిర్ బ్యాంగ్స్ తెరుచుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఉండేవారని పోలీసుు తెలిపారు. మిస్త్రీ మృతిపట్ల ప్రధానిసహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా…తాను ఇక ప్రయాణసమయంలో తప్పక సీట్ బెల్ట్ ధరించాలని నిర్ణయించుకున్నానని…..ప్రయాణంలో విధిగా బెల్ట్ ధరించాలని అందరూ ప్రతిజ్ఞ తీసుకుందామని ట్విట్టర్ వేదిగ్గా విజ్ఞప్తి చేశారు మహీంద్రా.
https://twitter.com/anandmahindra/status/1566390024933093376?s=20&t=io1GhhBgOM7QIwvRbQl8JA
https://twitter.com/anandmahindra/status/1566636583297875968?s=20&t=io1GhhBgOM7QIwvRbQl8JA