రాష్ట్రంలో విద్యారంగ పురోభివృద్ధిని సమీక్షించేందుకు వరల్డ్ బ్యాంకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గుజరాత్ లో పర్యటిస్తోంది. వరల్డ్ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జైమ్ సవేద్రా నేతృత్వంలోని ప్రతినిధి బృందం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని 10 వేల కోట్ల రూపాయల మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్, అలాగే డేటా ఆధారిత కార్యక్రమాల దృష్ట్యా పాఠశాల విద్యలో మార్పును విశ్లేషించింది. రాబోయే ఐదేళ్లకు సుమారు రూ.10,000 కోట్లతో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్ట్ కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,133 ప్రభుత్వ పాఠశాలలు, 5847 ఎయిడెడ్ పాఠశాలలు ప్రయోజనం పొందనున్నాయి.
అధికారిక వర్గాల నివేదికల ప్రకారం, 20 వేల పాఠశాలలకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, విద్యా సౌకర్యాలు అందించనున్నారు. వచ్చే ఐదేళ్లలో 50 వేల కొత్త తరగతి గదులు, 1,50,000 గదుల్లో స్మార్ట్ క్లాసుల సదుపాయం, 20000 కొత్త కంప్యూటర్ ల్యాబ్లు, 5000 టింకరింగ్ ల్యాబ్ల నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం వరల్డ్ బ్యాంక్ సహా ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 1 బిలియన్ US డాలర్ల రుణాన్ని ఆమోదించాయి. మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు దేశంలోనే విద్యారంగంలో వరల్డ్ బ్యాంకు అత్యధిక పెట్టుబడి పెట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని 1 కోటి మందికి పైగా విద్యార్థులు నేరుగా లబ్ధి పొందనున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)