మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని మరోసారి భారత యువతి గెలుచుకుంది. హర్నాజ్ కౌర్ సింధు ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. ఇజ్రాయెల్ లోని ఐలాట్ లో జరిగిన తుది పోటీలో హర్నాజ్ విజేతగా నిలవగా… మొదటి రన్నరప్ గా మిస్ పరాగ్వే, రెండో రన్నరప్ గా మిత్ సౌతాఫ్రికా నిలిచారు. సోమవారం ఉదయం పోటీ ప్రారంభమైనప్పుడు, హర్నాజ్ టాప్ 16కి చేరుకుంది. స్విమ్సూట్ రౌండ్ తర్వాత, ఆమె టాప్ 10లో స్థానం దక్కించుకుంది. ఇక చివరి రౌండ్లో…హర్నాజ్ యువతులకు మంచి సందేశాన్ని ఇచ్చి న్యాయనిర్ణేతల్నిఆకట్టుకుంది. ‘మీపై మీరు విశ్వాసం ఉంచండి….. నేటి యువత ఎదుర్కొంటున్న పెద్ద ఒత్తిడే వాళ్లపై వాళ్లకు నమ్మకం లేకపోవడం అని అంది. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం ఆపండి..ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలపై చర్చిద్దాం రండి..ఎందుకంటే మీ జీవితానికి మీరే నాయికలు…నన్ను నేను నమ్మాను కనుకే ఇప్పుడీ స్థానంలో ఉన్నాను’ అని తెలిపింది హర్నాజ్. అలాగే వాతావరణ మార్పుల గురించి అడిగిన ప్రశ్నలకు హర్నాజ్ చక్కటి సమాధానం ఇచ్చింది. నష్టం జరిగిన తరువాత పశ్చాత్తాపపడి దిద్దుబాటు చర్యలు తీసుకునే కన్నా ముందే బాధ్యతగా ఉండాలని బదులిచ్చింది. ప్రతి రౌండ్లోని పాయింట్లను లెక్కించి ముందు నిలిచిన హర్నాజ్ సంధును మిస్ యూనివర్స్ గా ప్రకటించారు. మిస్ మెక్సికో ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ 2021గా హర్నాజ్కు కిరీటాన్నిపెట్టింది. ఇక మూడో రన్నరప్ గా భారత్ కు చెందిన అడ్లైన్ కాస్టెలినో నిలిచింది.