
file photo
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 14మంది గాయపడిన సంగతి తెలిసిందే. దీంతోనలందా, సాసారామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులను అమలు చేస్తున్నారు. అశోక చక్రవర్తి జయంత్యుత్సవాల సందర్భంగా సాసారామ్లో జరిగే కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొనవలసి ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, సెక్షన్ 144 అమలు నేపథ్యంలో ఆయన పర్యటనను బీజేపీ రద్దు చేసింది. ఇదిలావుండగా, కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్, అశ్విని కుమార్ చౌబే శుక్రవారం సాసారామ్కు వెళ్లి, అక్కడి పరిస్థితిని సమీక్షించారు.