స్వదేశీ రక్షణ తయారీని ప్రోత్సహించే విధానానికి అనుగుణంగా వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమల నుంచి రూ. 5 లక్షల కోట్ల విలువైన సైనిక పరికరాలను కొనుగోలు చేయాలని రక్షణశాఖ యోచిస్తోంది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ దేశీయ కొనుగోళ్ల అంచనాలను వెల్లడించారు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్.
రవాణా విమానాలు, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, సంప్రదాయ జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు తోపాటు సోనార్ సిస్టమ్స్ వంటి 101 ఆయుధాలు, సైనిక ప్లాట్ఫారమ్ల దిగుమతిని 2024 నాటికి భారత్ నిలిపివేస్తుందని ఆగస్టు 2020లో మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
108 మిలిటరీ ఆయుధాలు అధునాతన కొర్వెట్లు, ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ట్యాంక్ ఇంజన్లు సహా రాడార్ల వంటి సిస్టమ్ల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ రెండో జాబితా గత ఏడాది మేలో విడుదలైంది.
డిసెంబర్లో మంత్రిత్వ శాఖ 2,500 వస్తువులతో కూడిన జాబితాను విడుదల చేసింది, ఇవి ఇప్పటికే దేశీయంగా అభివృద్ధి చేశామంటూ. డిసెంబర్ 2024 నాటికి దేశంలో అభివృద్ధి చేయనున్న 351 పరికరాల జాబితాను కూడా విడుదల చేసింది.
మంత్రి తన సమాధానంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా…దేశీయ రక్షణ తయారీని పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పుకొచ్చారు. రక్షణ రంగంలో ఆటోమేటిక్ రూట్ కింద ఎఫ్డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతున్నట్లు గతేడాది మేలో ప్రభుత్వం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. భారత సాయుధ దళాలు వచ్చే ఐదేళ్లలో దాదాపు USD 130 బిలియన్లు మూలధన సేకరణలో ఖర్చు చేయవచ్చని అంచనా. ప్రభుత్వం ఇప్పుడు దిగుమతి చేసుకున్న సైనిక ప్లాట్ఫారమ్లపై ఆధారపడటాన్ని తగ్గించాలనుకుంటోంది. దేశీయ రక్షణ తయారీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. రక్షణ మంత్రిత్వ శాఖ రాబోయే ఐదేళ్లలో రక్షణ తయారీలో రూ. 1.75 లక్షల కోట్లు టర్నోవర్ని లక్ష్యంగా పెట్టుకుంది, ఇందులో రూ. 35,000 కోట్ల విలువైన మిలిటరీ హార్డ్వేర్ ఎగుమతి లక్ష్యం కూడా ఉంది” అని మంత్రి తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)