దేశంలో సుపరిపాలన అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ది అని సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేస్తుంటారు. కానీ ఇది పెద్ద బూటకం అని స్పష్టంగా తేలిపోయింది. పంజాబ్ లో ఇటీవల తెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం గురించి తెలుసుకుంటే కళ్ళు చెదిరిపోతాయి.
పంజాబ్ రాష్ట్రంలో ఒక మంత్రి గారు 20 నెలలుగా పని చేస్తున్నారు. జీతం భత్యం సౌకర్యాలు కూడా పొందుతున్నారు. కానీ ఆయన పేరుతో ఉన్న మంత్రిత్వ శాఖ అసలు పంజాబ్ ప్రభుత్వంలో లేనే లేదట. దీన్నిబట్టి ఆప్ పరిపాలన ఏ రకంగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2022 మార్చి నెలలో పంజాబ్లో భగవంత్ మాన్ నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం ఏర్పడింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2023 మే నెలలో కుల్దీప్సింగ్ ధలివాల్కు రెండు శాఖలు కేటాయించింది. ఆయనకు ఎన్ఆర్ఐ వ్యవహారాలు, పరిపాలన సంస్కరణలు విభాగం బాధ్యతలు అప్పగించింది. 2024లో చివర్లో మరోసారి పునర్వ్యవస్థీకరణ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. తాజాగా దానిని సవరించింది.
ఇప్పుడే అస్సలు బంగారం బయటపడింది.. కుల్దీప్ సింగ్కు కేటాయించిన పరిపాలన సంస్కరణలు అనే శాఖ ఉనికిలో లేదని లెక్క తేలింది. సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్లో మార్పులు చేస్తున్నట్లు అందులో పేర్కొంది.
ఈ విషయంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. “పంజాబ్లో పాలనను ఆప్ ఒక జోక్గా మార్చింది. ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా ఆ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి ఒక శాఖను తన మంత్రి నిర్వహిస్తున్నారనే విషయం సీఎంకు కూడా తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోండి” అని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి ధ్వజమెత్తారు.
మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది ఒక బూటకపు హడావుడి తప్ప నికరమైన వ్యవస్థ కాదు అని స్పష్టంగా తేలిపోయింది.