‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హైదరాబాద్కు రానున్నారు. అయితే దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి ఆహ్వానం పలకడం ఆనవాయితీ. అయితే ఈసారి ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ వెళ్లడంలేదు. తనకు బదులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నామినేట్ చేశారు సీఎం కేసీఆర్.
ప్రధానిని ఆహ్వానించడానికి ప్రోటోకాల్ ప్రకారం సీఎం వెళ్లాల్సి ఉండగా, తనకు బదులుగా పశుసంవర్ధక, మత్స్య & సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లనున్నారు.
ఇదే పర్యటనలో ప్రధాని మోదీ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) 50వ వార్షికోత్సవ వేడుకలను కూడా ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ ఎం మహేందర్ రెడ్డి శుక్రవారంనాటి ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా కేంద్ర బృందాలతో సహా కనీసం 7,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.