నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కరీంనగర్ వాసుల చిరకాల వాంఛ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉన్నాయని నిరుపేదలు లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుకోలేరని…
నిరుపేదలు సైతం వైద్య విద్యను అభ్యసించేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని మంత్రి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేసిందని…దాన్నికొందరు చాలా రకాలుగా ప్రచారం చేశారనీ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.
సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావులు చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకువచ్చారని గంగుల వివరించారు.ఆగస్టు నుండి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.
తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు.
వేగవంతంగా పనులు చేపట్టి శాశ్వత భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకతో కరీంనగర్… హైదరాబాద్ వరంగల్ తర్వాత మెడికల్ హబ్ గా మారనుందని గంగుల అన్నారు.