పాకిస్తాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ పాకిస్తాన్ ప్రజలను ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి టీ తాగడం తగ్గించాలని కోరారు. “పాకిస్తాన్ టీని దిగుమతి చేసుకుంటుంది, దాని కోసం డబ్బు అప్పుగా తీసుకోవలసి ఉంటుంది. తేయాకు ఉత్పత్తిలో దేశం స్వతంత్రంగా మారే వరకు.. ప్రజలు అలాంటి వస్తువులన్నింటికీ దూరంగా ఉండాలి” అని ఫెడరల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మంత్రి జూన్ 15న అన్నారు.
کتنی آسانی سے آپنے ہم سے ہماری زندگی مانگ لی ۔۔ pic.twitter.com/zJE9wWFtXw
— Nabya Shahid (@nabyashahid) June 14, 2022
ప్రపంచంలోనే టీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం పాకిస్థాన్. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు $60 మిలియన్ల విలువైన టీని దిగుమతి చేసుకుంది, దీని కోసం డబ్బును అప్పుగా తీసుకోవలసి వచ్చింది. “మేం టీని అప్పుగా దిగుమతి చేసుకుంటున్నందున టీ వినియోగాన్ని ఒకటి నుంచి రెండు కప్పుల వరకు తగ్గించాలని నేను దేశానికి విజ్ఞప్తి చేస్తున్నా” అని ఆయన పేర్కొన్నారు.
ఈ చర్య పాకిస్తాన్లో తక్కువ విదేశీ కరెన్సీ నిల్వలను ప్రతిబింబిస్తుంది. వేగంగా పడిపోతున్న విదేశీ కరెన్సీ నిల్వలు అధిక దిగుమతుల ఖర్చులను తగ్గించుకోవాలని, నిధులను ఆదా చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి ఏర్పడిందని నివేదికలు పేర్కొన్నాయి.
ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ స్థానంలో పదవిలోకి వచ్చిన ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఇటీవలి ఆర్థిక సంక్షోభం పెద్ద పరీక్ష. ఇంతలో ఈ సంఘటనకు సంబందించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. నెటిజన్లు తమ రోజువారీ టీ వినియోగాన్ని తగ్గించడం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో ఎలా సహాయపడుతుందని ఆశ్చర్యపోతున్నారు. దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి.
“పాకిస్తాన్ ప్రభుత్వం టీని ఉచితంగా అందించడం లేదని.. వినియోగదారులు తాము తాగే చాయ్కు డబ్బు చెల్లిస్తారు. చాయ్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు’’ అని ఒక నెటిజెన్ ట్వీట్ చేసింది.
“అహ్సాన్ ఇక్బాల్ సాహిబ్, మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ప్రయత్నించవచ్చు, మనం కలిసి తినడం/తాగడం మానేద్దాం. భవిష్యత్తు గురించి మీ దృష్టితో చాలా సంతోషిస్తున్నాం. వర్తమాన కాలం కంటే 500 సంవత్సరాలు ముందుంది మీ ఆలోచనా ధోరణి. మానవాళి రక్షకుడా” అంటూ వెక్కిరిస్తూ ట్వీట్ చేశారు మరొక నెటిజెన్.
జూన్ మొదటి వారంలో పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు 10 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో అదే 16 బిలియన్ డాలర్లుగా ఉంది. నివేదిక ప్రకారం నిధులను ఆదా చేయడానికి పాకిస్తాన్ అధికారులు అనవసరమైన లగ్జరీ వస్తువుల దిగుమతిని కూడా అడ్డుకున్నారు.