మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో దేశమంతా అటువైపు చూస్తున్న వేళ బిహార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నిలిచింది. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కు షాక్ ఇస్తూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరిపోయారు. ఎంఐఎంకు చెందిన మొహమ్మద్ అంజార్ నైమీ, ముహమ్మద్ ఐజర్ అస్ఫీ, సయ్యద్ రుక్నూద్దీన్, షానవాజ్ తమ పార్టీలో చేరినట్టు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం బిహార్లో ఏకంగా 5 స్థానాల్లో విజయం సాధించింది.
తాజా చేరికలతో ఆర్జేడీ బలం పెరిగి పెద్దపార్టీగా ఆవిర్భవించింది. 77 ఎమ్మెల్యేలు బీజేపీకి ఉండగా..తాజాగా నలుగురి బలం తోడై 79మంది అయ్యారు ఆర్జేడీకి. ఇక కాంగ్రెస్కు 19 మంది ఎమ్మెల్యేలు, వామపక్ష పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకుని బిహార్లో ఉనికి చాటుకుంది ఎంఐఎం. ఆ ఎన్నికల్లో కీలక స్థానాల్లో ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా దాదాపు 20 చోట్ల ఆర్జేడీ విజయావకాశాలను ఆ పార్టీ దెబ్బతీసింది.